Narayankhed News : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల ప్రజలకు తహసీల్దార్ హేమంత్ కుమార్ సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, పొంగి పొర్లుతున్న కాలువలు, చెరువులు, కుంటల వైపు వెళ్లకూడదని, కరెంట్ స్తంభాలను తాకొద్దని, నీళ్లు వేడిచేసి తాగాలని తెలిపారు. ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే గ్రామ పంచాయితీ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
