Sangareddy News : సంగారెడ్డి జిల్లా సింగూర్ ఆనకట్ట వద్ద ఉన్న 100 MLD బుస్సారెడ్డిపల్లి నీటి శుద్ధి కర్మాగారంలో ప్రస్తుతం మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా రేపు 12-09-2025 తేదీన జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాలకు తాత్కాలికంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయబడనుంది.
ప్రభావిత మండలాలు
- సదాశివపేట
- కొండాపూర్
- కంది
- పటాన్ చెరువు
- జహీరాబాద్
- మొగుడంపల్లి
- కోహీర్
- మునిపల్లి
నీటి సరఫరా నిలిచే మున్సిపాలిటీలు
- జహీరాబాద్
- కోహీర్
- సదాశివపేట
- సంగారెడ్డి
- ఇస్నాపూర్
- తెల్లాపూర్
- ఇంద్రేశం
- అమీన్పూర్
మొత్తం 241 గ్రామాలు మరియు 8 మున్సిపాలిటీలు ఈ నీటి సరఫరా అంతరాయం వల్ల ప్రభావితమవనున్నాయి.
మిషన్ భగీరథ ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన నీటి నిల్వలు ముందుగానే చేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రేపటితో పనులు పూర్తయ్యాక, నీటి సరఫరా మునుపటిలాగే పునరుద్ధరించబడుతుందని అధికారులు తెలిపారు.
