Latest News : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మొదటి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇళ్లు పూర్తి కావడంతో గృహప్రవేశాలు జరగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
