Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావిణ్య శనివారం వెల్లడించారు. వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు తక్షణం సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
