Sangareddy News : స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా, శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే లక్ష్యంగా బిడిఎల్ భానూర్ పోలీసు స్టేషన్ పరిదిలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాలలో జిల్లా పోలీసు, క్విక్ రియాక్షన్ టీమ్ల సహాయంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలలో ధైర్యాన్ని నింపి, చట్టాన్ని ఉల్లంఘించాలని చూసే అసాంఘిక శక్తులకు, రౌడీషీటర్లకు బలమైన హెచ్చరిక పంపడమేనని అన్నారు.
