Sadashivpet News : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం గల్లీ ప్రజల కోరిక మేరకు రద్దీగా ఉండే సదాశివపేట పట్టణంలోని సర్దార్ రోడ్డు లో గురువారం బిఆర్ఎస్ నాయకులు పెద్ద నరసింహ గౌడ్ తన సొంత డబ్బులతో రోడ్డుపై స్పీడ్ బ్రేక్ లను ఏర్పాటు చేశారు. 14వ వార్డులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జీర్లపల్లి అజయ్, కొవ్వూరి మల్లేశం గౌడ్, ధనంజయ గౌడ్ , జైన్ ప్రదీప్, గొల్లగూడెం శంకర్ గౌడ్, చీకుర్తి బక్కన్న , ప్రమోద్ పంతులు, దోసపల్లి ప్రభు, వెంకటేశ్వర రెడ్డి , కంది సంతోష్, బంజగండ్ల సాయి, బుదేరా కృష్ణ గౌడ్, మాణిక్ రెడ్డి, సంగారెడ్డి, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
