Sangareddy News : భారత రాజ్యాంగ దినోత్సవం (National Constitution Day) పురస్కరించుకొని సంగారెడ్డి అంబేద్కర్ లా కళాశాలలో బుధవారం నిర్వహించిన రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది కలిసి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ (National Constitution of India Pledge) ను చదివి, రాజ్యాంగ విలువలను పాటించేందుకు అంకిత భావంతో ప్రతిజ్ఞ చేశారు.
