
Andole News : నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోందనిజిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుఅన్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ శాసన సభ నియోజకవర్గంలోని వట్పల్లి మండలం
లో సహా హేదా నగర్ గ్రామ లబ్దిదారులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కలెక్టర్ భూమి పూజ చేశారు.
ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్దిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
వట్పల్లి మండలాలకు చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేశారు.
అంతకుముందు ఆందోల్ మండలంలో నేరేడు కుంట, వాట్పల్లి మండలంలోని గట్టుపల్లి గ్రామాలలో నిర్వహించిన బడిబాట, అమ్మ మాట అంగన్వాడి బాట, కార్యక్రమాలను లాంచనంగా ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మోడల్ ఇంటిని సందర్శింపజేసి, నిర్ణీత వ్యయంతో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పాండు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.