Sadashivpet News : పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జీఎస్టీ పై అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ కోవూరు సంగమేశ్వర్ శనివారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు నిర్వహిస్తున్న జిఎస్టి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి .బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి.తదితర నాయకులు హాజరవుతున్నారని ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారస్తులు ,పార్టీ నాయకులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
