Bobbiligaama News

Sadashivpet News : భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలని తహసిల్దార్ సరస్వతి రైతులకు సూచించారు. సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామా గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా ఆమె మాట్లాడుతూ… రైతులు భూములకు సంబంధించిన సమస్యలు రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. భూ సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకొని పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు.స్థానిక రైతుల నుంచి రెవెన్యూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *