Badi baata collector

Sangareddy News : జిల్లాలోని అన్ని గ్రామాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

గురువారం అందోల్ మండలం నేరడి గుంట, వట్టిపల్లి మండలం గట్టుపల్లి లో నిర్వహించిన అంగన్వాడి బాట బడిబాట కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా గ్రామ పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలో 1249 ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్లు వీటిలో నైపుణ్యం గల 5248 మంది ఉపాధ్యాయులు ఉన్నారు అన్నారు. వీటితోపాటు జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా22 కస్తూరిబా పాఠశాలను, పది ఆదర్శ పాఠశాలలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనరునాటి గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ప్రారంభానికి ముందే అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు.
జిల్లాలో ఒకటో తరగతి నుండి మూడో తరగతి వరకు వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పాఠశాలలో మౌలిక వసతుల మెరుగు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు రెండు జతలు స్కూల్ యూనిఫామ్ దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 732211 పాఠ్యపుస్తకాలకు గాను715161 పాఠ్య పుస్తకాలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సరఫరా అయినట్లు తెలిపారు. జిల్లాలో అక్షర సితార శాతం పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో అక్షర సత పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 64.08 శాతం అక్షరాస్యత పెంచే క్రమంలో జిల్లాలోని 18, 447 మహిళా సంఘాల నుండి 55371 మంది సభ్యులను నిరక్షరాస్యులుగా గుర్తించడం జరిగింది అన్నారు వారిని టార్గెట్ గ్రూపులుగా నేస్తమా ఎనిమిది వందల తొంబై మంది విలేజ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లను ఏర్పాటు చేశారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డీపీఎం ఎపిఎం సుశీల సహకారంతో వారిని అక్షరాస్యులుగా మార్చడానికి వైద్యున విద్యాపీఠం నుండి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమంలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అన్ని పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ పాఠశాల విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ విద్యతోపాటు పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల వయసు లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ప్రీ ప్రైమరీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, పి డి మెప్మా గీత, ఆర్ డి ఒ పాండు, మార్కెటింగ్ చైర్మన్ జగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *