18/02/2026
Sangareddy News

Sangareddy News : వివరాలలోనికి వెళితే సంగారెడ్డి జిల్లా హద్నూర్ మండలానికి చెందిన పాల్టెక్నీక్ పూర్తి చేసిన అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా జిల్లా సోషల్ మీడియా ను హ్యాండిల్ చేస్తున్న సిబ్బంది హద్నూర్ ఎస్ఐ కీ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వ్యసాయ పొలాలలో ఉన్న లొకేషన్ కు చేరుకొని అమ్మాయికి నచ్చచెప్పి ఆత్మహత్యకు పాల్పాడటం సరికాదని, ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదని ఎడ్యుకేషన్ పై దృష్టి సారించాలని తెలిపి, అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇట్టి విషయంలో అమ్మాయి తల్లిదంద్రులు కృతఙ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *