Navodhaya school

Sangareddy News : నవోదయ విద్యాలయానికి భవనం పరిశీలన సంగారెడ్డి జిల్లాకు నూతనంగా మంజూరైన నవోదయ విద్యాలయానికి సుల్తాన్ పూర్, జేఎన్టీయూలో ఈ విద్య సంవత్సరానికి తాత్కాలిక ఏర్పాటు కు భవనంను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ… జిల్లాలో నూతన నవోదయ విద్యాలయ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో మౌలికసదుపాయాలు పూర్తి చేయాలన్నారు.విద్యార్థుల కు అనుకూలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ,ల్యాబ్, హాస్టల్ వసతులను పరిశీలించారు. నవోదయ విద్యాలయం వలన సంగారెడ్డి జిల్లా విద్యార్థులకు విద్య మరింత చేరువవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *