Sangareddy News : సంగారెడ్డి జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్) గా శ్రీ సి.హెచ్. రఘునందన్ రావు గారు. ఈ రోజు తేది: 19.09.2025 నాడు భాద్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శ్రీ రఘునందన్ రావు గారు 1995 బ్యాచ్ ఎస్ఐ. గతంలో తెలంగాణ పోలీస్ అకాడమీలో డిఎస్పీగా విధులు నిర్వహించారు. ఇటీవల అదనపు ఎస్పీ గా పదోన్నతి పొంది, సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) గా బదిలీపై వచ్చి, భాద్యతలు స్వీకరించారు.
