Sadashivpet News : సంగారెడ్డి పట్టణానికి చెందిన సాహితి రాము గౌడ్ ఆధ్వర్యంలో శబరిమల మహాపాదయాత్రకు వెళ్లిన అయ్యప్ప స్వాములను సదాశివపేట అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద సదాశివపేట స్వాములు మంగళవారం భిక్ష ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సదాశివపేట అయ్యప్ప మందిర గురు స్వాములు ఆర్ఏ సుధాకర్, గౌడ్ గోనెశంకర్ గురు స్వామి, నాయుడు గురు స్వామి, మామిడి రాజు గురు స్వామి, మాజీ కౌన్సిలర్ నాగరాజు గౌడ్ ,,సంక్షయ్ గౌడ్ (అడ్వకేట్),నందు స్వామి, కార్తీక్ గౌడ్ శ్రవణ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
