Sadashivpet News : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు అగ్నిమాపక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బిక్షపతి ఆధ్వర్యంలో సదాశివపేటలోని ప్రవేట్ ఆసుపత్రీ సాయిరాం హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం చేపట్టడం చేపట్టారు. హాస్పటల్లో అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని ఆస్పత్రిలోని డాక్టర్లకు, సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది నరేష్ రెడ్డి మున్నాఫ్, తయాబ్, నవీన్ కుమార్, హైమద్, రవీందర్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.
