Narayankhed News : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రెవెన్యూ సబ్డివిజన్ కార్యాలయంలో సబ్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి ఎన్. ఉమా హారతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో కూడా ప్రజా పాలన దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
