Sadashivpet News : సదాశివపేట లోని శాస్త్రి రోడ్డు లో ఏ వన్ బ్యాంగిల్స్ స్టోర్ ను రీ ఓపెనింగ్ చేయడం జరిగింది. మాతృదేవోభవ అనే పదాన్ని అక్షరాల చూయించిన ఏ వన్ బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటుదారులు అబ్దుల్ వహాబ్, అబ్దుల్ రౌఫ్ లు వారి తల్లి అమీనాభి చేతుల మీదుగా బ్యాంగిల్స్ స్టోర్ ను రీఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా అబ్దుల్ వహాబ్, అబ్దుల్ రౌఫ్ లు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మమ్మల్ని వ్యాపారంలో ఉన్నత స్థాయిలోకి తీసుకురావడం జరిగింది అన్నారు.
తమ తల్లి ద్వారా షాపును రీఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండి వాజిద్, అబ్దుల్ అయూబ్, అబ్దుల్ రెహమాన్, ఎండి రజవాన్, ఎండి అక్బర్, ఎండి నిజాం, సాయి కృష్ణ, సోలాపురం నవీన్ కుమార్, సోలా పురం శ్రావణ్ కుమార్,
రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
